Sunday, August 2, 2020

వైభవ భారతం - రాజశ్రీలు


తలపైన హిమన్నగము
పాదాల హిందుసముద్రము
ఎడుమనరేబియ సముద్రం
కుడిని బంగాళాఖాతం - 1


భరతుడు పాలించిన భూమి
పాడిపంటల పవిత్రభూమి
బంగరుపంటల సేద్యసీమ
సకలసంపదల భాగ్యసీమ - 2

గంగాయమున పవిత్రనదులు
కృష్ణకావేరిసింధుగోదారి నదులు
పరవళ్లు తొక్కిన జీవనదులు
పరవశించిన పల్లెసీమలు - 3

మనములనిండా విచిత్ర చిత్తులు
మనుషులలోనా విభిన్నవృత్తులు
వృత్తేదైనా ప్రేమిస్తుంటాం
భారతీయతకై జీవిస్తుంటాం - 4

భూగోళఖగోళ మర్మముల
శోధించిఛేదించిన నేల
అన్నివిద్యలకాలవాలమైనది 
సకల శాస్త్రముల నెలవైనది - 5

సకలసృష్టిలో సర్వాత్మనుజూసి
పరులసేవలో పరమాత్మనుజూసి
ప్రకృతినమితం ప్రేమించిన నేల
పంచభూతాల పూజించిన నేల - 6

 
తాత్వికచింతనలో తారాడి
భగవద్సాధనలో తేలాడి
ఋషిమునిగణము నడయాడిన నేల
పరమపదం పారాడిన నేల- 7

సర్వవిద్యాదురంధరులు
సకలశాస్త్ర పారంగతులు
పుట్టిపెరిగిన పుణ్యభూమి
తత్వవేత్తల ధన్యభూమి - 8

తపోవిద్యలో తలామునకలై
కైవల్యం కరతలామలకమై
యోగవిద్య నందించి నేల
జగతికివిద్యలు నేర్పిన నేల - 9

సకలసంకృతుల కాటపట్టు 
సంప్రదాయముల కాయువుపట్టు
ప్రాణికోటికంత పవిత్రభూమి
మానవతావిలువల మహితభూమి - 10


No comments: