Saturday, October 31, 2020

చిత్ర మధురవాణి

మధురవాణి
....................
1.ఇది నూతన సాహిత్య ప్రక్రియ
2.ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి
3.ప్రతి పాదంలో నాలుగు పదాలు ఉంటాయి
4.రెండు...నాలుగు పాదాల చివర అంత్యప్రాస ఉండును
5.నియమబద్దమైన వచన కవిత
ఉదాహరణకు
.....................
తల్లిని విడచి భార్యను చేరి
తల్లిని దూరం చేయుట తగదన్న
తల్లిని మించిన దైవం లేదని
పెద్దలు చెప్పిన మాట నిజమన్న
గమనిక
.............
1.నూట ఎనిమిది మధురవాణిలు వ్రాసిన కవికి**వాణిశ్రీ**పురస్కారం  లభిస్తుంది.
......................................................
తెలంగాణ తెలుగు కళా నిలయం,భైంసా
నిర్మల్ జిల్లా తెలంగాణ
అధ్యక్షులు.గంగుల చిన్నన్న..తెలుగు పండితులు
ప్రధాన కార్యదర్శి.కడారి దశరథ్..తెలుగు పండితులు
మధురవాణి రూపకర్త.జాధవ్ పుండలిక్ రావు పాటిల్
సమీక్షలు.డాక్టర్ వి.జలంధర్..ఆచార్యులు తెలంగాణ విశ్వవిద్యాలయం


 ఆసువోసి అల్లుకున్న గూడునీట మునిగింది

గూడులేని గువ్వతీరు అవ్వమనసు బెదిరింది

ఆపద్భాంధవునివోలె చెట్టుచేయి చాచింది 

దిగులుమరచి ఆయవ్వ చెట్టుసంక చేరింది - 1

అధునాతన వస్త్ర ధారణలో మెరసి పండుటాకు మోము సిగ్గు లొలికింది ముదిమి వయసుకేగాని మనసుకు కాదంటు ముసలవ్వ మదినిండ తెగ మురిసిపోయింది చిత్ర మధురవాణి అంకిత భావము అకుంఠిత ధీక్ష అమరం అలనాటి గురుశిష్య బంధములు నిశ్వార్థ త్యాగము నిండైన గౌరవం గురుశిష్య పరంపర నొసగేటి గురుకులములు ఆకలికి తాలలేక అణువణువు వెతికినా ఆయాసమె తప్ప ఆబాధ తీరలేదు దాహార్తిని తీర్చ చెలిమెవైపు తొంగిచూడ అలసిన యీదేహాన్ని అద్దమై చూపించెను

No comments: