Wednesday, January 22, 2020

వాడుకభాషా వత్సలుడు(గిడుగు రాంమూర్తి)


పాలకభాష పండితభాష
ప్రామాణిక భాషంటూ
భాషను బహురూపుల బంధించి
శుద్ధగ్రాంథీకంలో సాహిత్యరచన జేసి
విద్యను బ్రహ్మపదార్థంగా
సామాన్య జనానికి సదువు వాసన సోకకుండా
పండితుల వంటింటి కుందేలునుజేసి
వాడుకభాషకు విలువనీయక
మేధావులంతా తత్సమభాషను
మేథస్సు నిదర్శనంగా ఊరేగుతున్న కాలంలో
ప్రజలభాష పరపతిపెంచి
సదువులతల్లిని సర్వజనుల
చేరదీసి చేయికందించిన
వ్యవహారికభాషోద్యమపితామహుడు గిడుగు

మాటలుతప్ప లిపిలేని
సవరభాషను సవరించి
సవర సాహిత్య సృజనకు
పునాదివేసిన భాషాశాస్త్రవేత్త గిడుగు

తెలుగుపత్రికను స్థాపించి
పండితప్రశంసాయుత గ్రాంధికభాషను గద్దెదించి
పామరజనరంజక ప్రజలవాడుకభాషకు పట్టంగట్టి
మాటలకుమాత్రమే పరిమితమై
గ్రామ్యంగా ముద్రవేయబడి
పలురకాల పరిహాసమొందిన
పల్లెభాషను
కావ్యభాషగా మెరిపించి మురిసిన భాషాయోధుడు గిడుగు!
సాధారణభాషలో సాహితీసృజనకు బాటలువేసిన సాహిత్యపిపాసి గిడుగు!

మాట్లాడేభాష వేరు సదివే భాష వేరుగ
చదివేపిల్లల శ్రమజూసి
పాఠ్యపుస్తకాలన్ని ప్రజలభాషలుండాలని
సాహిత్యమేగాక విజ్ఞానాన్ని
ప్రజలభాషకు మార్చి
సదువులమ్మను సామాన్యప్రజల లోగిల్లలో నిలిపిన అపర భగీరథుడు గిడుగు

         పచ్చిమట్ల రాజశేఖర్
                 జగిత్యాల
           9676666353

No comments: