Tuesday, April 3, 2007

నేటి సంస్కృతి!

మన భారతదేశం సంసృతీ సంప్రదాయాలకు నిలయం.
అలాంటి పవిత్రదేశంలో జన్మించిన మనమే వాటిని చిన్న చూపు చూస్తున్నాం.
సృస్టిలో ప్రతి మనిషి తన చుట్టు ఉండే సమాజపు కట్టుబాట్లకు అనుగుణంగా మెదులుతుంటాడు.
ప్రతి దేశానికి ఏవో కొన్ని కట్టుబాట్లు ఉంటాయి.అలాంటివే మన సంప్రదాయాలు కూడా.
కాని మన దేశంలో కొంచెం ఎక్కువ.అంత మాత్రాన అది చాదస్తం అనుకుంటే పొరపాటే.
ఈ కట్టుబాట్లలో స్వేచ్చ లేదంకోవడం తప్పు.మనకూ స్వేచ్చ వుంది కాని విచ్చలవిడి తనము లేదు.
అలా విచ్చలవిడిగా తిరుగడమే స్వేచ్చ అనే భ్రమలో యువత
నేడు మన సంస్కృతి సంప్రదాయాలు,ఆచార వ్యవహారాలు
ఇంతగా కనిపిస్తున్నాయంటే దానికి కారణం పల్లెలే.
అందుకే పల్లెలు "పల్లెలు పట్టుకొమ్మలని కీర్తించబడ్డాయి".
నాగరికత తెలిసిన మనం అభివృద్ది పేరుతో మన సన్స్కృతిని కాల రాస్తుంటే
అనాగరికులైన వాళ్ళు మాత్రం మన ఉనికిని కాపాడుతున్నరు.
వంటి వారిని గౌరవించాల్సింది పోయి అనాగరికులని,అవివేకులనీ నిందిస్తున్నాం.
మొక్క ఎంత ఎదిగినా, మనిషి నింగికి నిచ్చెనలేసినా పుట్టిన భూమిని,ఆచారాలను మరువద్దు.
కాని అన్ని మరిచిన మనమే వివేకులం.

మనిషి సంఘజీవి. తన చుట్టూ వున్న వారిని అనుకరిస్తుంటాడు,
తనకంటే మెరుగనుకున్న వాటిని అలవర్చుకుంటాడు.
ఈ క్రమంలోమన సంస్కృతి పూర్వ వైభవాన్ని క్రమంగా కోల్పోతుంది.
"అర్ధరాత్రి ఆడది ఒంటరిగా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టని"
పలికిన మహాత్ముని పలుకులకు నగర యువత అక్ష్రాల అద్దం పడుతోంది.
అర్ధ రాత్రి ఏ పబ్బుల్లో చూసినా,డిస్కోతెక్కుల్లో చూసినా యువతులే.
ధూమపానం, మధ్యపానం ఇలా ఏ రంగంలో చుసినా
మగాడితో పోటీ పడుతూ తమదైన శైలిలో ఎదుగుతున్నారు.
బహుశా అదే నిజమైన నాగరికతేమో!

ఈ విషయంలో యువతను ఆపలేము.
అదే నాగరికత అనే భ్రమలో వారున్నారు.
దీనికంతటికి కారణం విదేశీ వ్యామోహం,పరాయి సంస్కృతులపై మోజు.
ఈ మైకంలోంచి తేరుకునే వరకు వారిని ఎవ్వరూ ఆపలేరు.
అయినా మనం చేయగల్గిందేముంది వారిని రక్షించమని దేవున్ని ప్రార్థించడం తప్ప.

"నేటి బాలలే రేపటి పౌరులని" నిరంతరం పాడుకునే
మనదేశంలో వారి ప్రగతి పక్కతోవ పడుతోంది.
కీర్తి పతాకాన్ని నింగికి నిలిపే యువత మధ్యం మత్తులో మునిగి
తమ కాల్లపై తాము నిలబడలేకపోతుంది. అదే కల్చరని కాలరెగురవేస్తుంది.
"డేవుడా రక్షించు నా దేశాన్ని పవిత్రులనుండి పతివ్రతల నుండి"అని తిలక్ గారన్నారు.
కాని నేడు "దేవుడా! రక్షించు నా దేశాన్ని పరాయి సంస్కృతులనుండి" అని కీర్తించాలనుంది.
ఆదరించి గౌరవించే నాటి సంస్కృతికి పూర్తి విరుద్దంగా నేటి తరం నర్తిస్తుంది.
అందుకేనేమో! తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకోవడం మానేశరు.
ఎవరికి వారే యమునా తీరే అయి దేశం ప్రగతి సాదిస్తోంది.
అందుకే "దేవుడా రక్షించు నా దేశాన్ని "మోడర్న్ కల్చర్" అనే పెను ప్రమాదం నుండి"
అని మరోసారి వేడుకుంటున్నాను.

No comments: