Tuesday, March 28, 2017

యుగాది

 విరియించి తన కుంచె విదిలించెనో యేమొ
       ఆకురాల్చినతర్వు లంకురించె !
 మండుటెండను త్రోసి మావిచిగురుతొడ్గి
       పూలు ఫలముతోడ పుష్ట మొందె !
 పుట్టువయినభూమి పులకింత నొందేల
       విరగబూసెనుచూడు వేపలన్ని!
 చిగురుటాకులజేరి చిలుకలు కులుకంగ
           కొత్తరాగములెత్తె కోకిలమ్మ!
ఆరు రుచులతోడ నరుదైన పచ్చడి
     ఆరగించినమేను ఆర్తి దీరు!
అటులె జనుల చింత లన్నింటి నెడబాపి
    హితము గూర్చ వచ్చె హేవళంబి !

                -రాజశేఖర్ పచ్చిమట్ల
                       M.A M.Phil (central university)
                 తెలుగు లెక్చరర్
     

No comments: